కోడిపందేల స్థావరాలపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2021-01-16T04:58:42+05:30 IST

కోడిపందేల స్థావరాలపై పోలీసుల దాడులు

కోడిపందేల స్థావరాలపై పోలీసుల దాడులు

వరంగల్‌ అర్బన్‌ క్రైం, జనవరి 15: సంక్రాంతి సందర్భంగా హసన్‌పర్తి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని జయగిరిలో కోడిపందేల శిబిరంపై వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.3,200 నగదు, 4 పందెం కోళ్లను స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ నందిరాంనాయక్‌ వివరాల ప్రకారం.. జయగిరి శివారులో గురువారం కొందరు కోడిపందేలు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది వెళ్లి దాడులు చేశారు. అక్కడ నలుగురు వ్యక్తులు కోళ్లతో పందేలు కాస్తూ పట్టుబడ్డారు. పట్టుబడినవారిలో హన్మకొండ వాజ్‌పేయి కాలనీకి చెందిన దేవరకొండ రాములు, యాకూబ్‌పాషా, హన్మకొండ సమ్మయ్యనగర్‌కు చెందిన దేవరకొండ భిక్షపతి, ఏనుమాములకు చెందిన ఓని సుధాకర్‌ ఉన్నారు. వీరి నుంచి 4సెల్‌ఫోన్లు, 3 ద్విచక్రవాహనాలు, 4 పందెం కోళ్లతో పాటు రూ.3,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి హసన్‌పర్తి పోలీసులకు అప్పగించారు.  

Updated Date - 2021-01-16T04:58:42+05:30 IST