గిరిజనులందరికీ శుభాకాంక్షలు: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-08-09T21:56:10+05:30 IST

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అడవి బిడ్డలైన గిరిజనులు ప్రకృతి ప్రేమికులు, ఏ కల్మషం లేనివారని కొనియాడారు.

గిరిజనులందరికీ శుభాకాంక్షలు: చంద్రబాబు

అమరావతి: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అడవి బిడ్డలైన గిరిజనులు ప్రకృతి ప్రేమికులు, ఏ కల్మషం లేనివారని కొనియాడారు. టీడీపీ హయాంలో గిరిజనుల సంక్షేమానికి రూ.14,210 కోట్లు వ్యయం చేశామని తెలిపారు. గిరిజనుల కోసం వినూత్న సంక్షేమ పథకాలు తెచ్చామని చెప్పారు. ఈ ప్రభుత్వం గిరిజనుల అభివృద్దిని కాలరాయడం బాధాకరమని ఆయన విమర్శించారు. ఫుడ్ బాస్కెట్ రద్దు సహా అనేక గిరిజన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని, ఇకనైనా ప్రభుత్వం గిరిజనుల పట్ల బాధ్యతతో ఉంటుందని ఆశిస్తున్నామని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2020-08-09T21:56:10+05:30 IST