Vijayawada: బెంజ్ సర్కిల్లో ట్రాఫిక్ మళ్లింపు..
ABN , First Publish Date - 2021-10-02T13:33:58+05:30 IST
బెంజ్ సర్కిల్లో సీఎం జగన్ కార్యక్రమం ఉండటంతో పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ టూ చెన్నై వెళ్లే వాహనాల మళ్లిస్తున్నారు. వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను
అమరావతి: బెంజ్ సర్కిల్లో సీఎం జగన్ కార్యక్రమం దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ముందస్తుగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ టూ చెన్నై వెళ్లే వాహనాలను, వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జుంక్షన్ నుంచి పామర్రు, అవనిగడ్డ, రేపల్లె మీదుగా ఒంగోలుకు మళ్లిస్తున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలను హనుమాన్ జుంక్షన్ నుంచి నూజివీడు, మైలవరం, జి.కొండూరు ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్కు వాహనాలను పంపిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆంక్షలు మద్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా బెంజ్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లోని అంతర్గత రోడ్లలో కూడా ట్రాఫిక్ను అధికారులు నిలిపివేశారు.