వెలుగై దారి చూపండి!

ABN , First Publish Date - 2020-07-24T05:30:00+05:30 IST

విశ్వాసుల గురించి ఏసు ప్రభువు ప్రస్తావించిన మరో పోలిక... వెలుగు. ‘‘మీరు లోకానికి వెలుగు లాంటివారు. కొండ మీద ఉన్న నగరం మరుగున పడకుండా ఉంటుంది...

వెలుగై దారి చూపండి!

విశ్వాసుల గురించి ఏసు ప్రభువు ప్రస్తావించిన మరో పోలిక... వెలుగు. ‘‘మీరు లోకానికి వెలుగు లాంటివారు. కొండ మీద ఉన్న నగరం మరుగున పడకుండా ఉంటుంది. ఎవరూ దీపం వెలిగించి, దాన్ని బుట్ట కింద దాచి ఉంచరు. దీప స్తంభం మీద పెడతారు. అది ఇంట్లో ఉన్న వారందరికీ వెలుగును ఇస్తుంది. మీరు కూడా అదే విధంగా మనుషుల ముందు దీపంలా ప్రకాశించండి. మీ మంచి పనులను వారు చూస్తారు. పరలోకంలో ఉన్న మీ తండ్రి ఘనతను ప్రకాశింపజేస్తారు’’ (మత్తయి సువార్త 5:14-16) అని ఆయన చెప్పాడు.


చీకటి ఆవరించిన చోట దీపం వెలుగు నింపుతుంది. అలాగే పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న వారు చీకటిలో దీపంలా ఉండాలి. దారి తప్పిన హృదయాల్లో చీకటిని పారద్రోలి, విశ్వాసాన్ని వెలిగించాలి. అదే సమయంలో విశ్వాసులు చేసే మంచి పనులు అందరికీ తెలిసేలా ఉండాలి. అంటే దైవం చూపించిన దారిలో ప్రయాణించాలి. ఆ దారి గొప్పతనాన్ని అందరికీ తెలియజెప్పాలి. అప్పుడే దేవుడి ఘనతనూ, ఆయన చూపించిన మార్గంలోని విశిష్టతనూ ఇతరులు గ్రహించగలుగుతారు. తమ ‘విశ్వాసం’ అనే దీపాన్ని వెలిగించుకుంటారు. తోటివారికి దారి చూపే దీపాలవుతారు.

Updated Date - 2020-07-24T05:30:00+05:30 IST