మసాలా దినుసులతో జాగ్రత్త!

ABN , First Publish Date - 2021-03-04T05:40:12+05:30 IST

జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి మసాలా దినుసులు బాగా పనిచేస్తాయి. కానీ వాటిని ఎక్కువ మొత్తంలో ఖాళీ కడుపుతో తీసుకుంటే మాత్రం జీర్ణసంబంధమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నాను నిపుణులు

మసాలా దినుసులతో జాగ్రత్త!

జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి మసాలా దినుసులు బాగా పనిచేస్తాయి. కానీ వాటిని ఎక్కువ మొత్తంలో ఖాళీ కడుపుతో తీసుకుంటే మాత్రం జీర్ణసంబంధమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నాను నిపుణులు.

దాల్చినచెక్క: దాల్చినచెక్కను ఎక్కువగా ఉపయోగించడం వల్ల సినామల్‌డిహైడ్‌ అనే అలర్జీ వస్తుంది. ఈ అలర్జీ వల్ల నోట్లో పుండ్లు ఏర్పడడంతోపాటు తెల్లమచ్చలు వస్తాయి. నోటి లోపలి భాగంలో దురద వస్తుంది.

నల్లమిరియాలు: వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కొన్ని మందులు  పనిచేయవని పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు వీటి వినియోగం వల్ల  కొన్ని మందులు వాడినపుడు రియాక్షన్స్‌ తలెత్తి అలర్జీలు వస్తాయని రుజువయింది.

పాప్రికా: ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే స్టమక్‌ ఫ్లూ రిస్కు ఉంటుంది. పొత్త్తికడుపులో నొప్పితో బాధపడతారు. కడుపులో మంటగా ఉంటుంది. ఉదయాన తీసుకునే సలాడ్‌లో  కూడా ఈ పొడి వేసుకోవద్దు. 

మెంతులు: శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు మెంతులకు దూరంగా ఉండడం మంచిది. మెంతులు ఎక్కువ తీసుకోవడం వల్ల ఆస్తమా పెరుగుతుంది. గ్యాస్‌ ఎక్కువ కావడం, పొత్తికడుపులో నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

జీలకర్ర: ఇది జీర్ణక్రియ బాగా జరిగేట్టు చూస్తుంది. అయితే వీటిని ఎక్కువ వాడితే వేడిచేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. గుండెలో మంట వస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో వీటిని తక్కువగా ఉపయోగించాలి.

Updated Date - 2021-03-04T05:40:12+05:30 IST