‘హైదరాబాద్‌ నుంచి వచ్చే వారితో అప్రమత్తంగా ఉండాలి’

ABN , First Publish Date - 2020-07-03T16:02:59+05:30 IST

హైదరాబాద్‌ నుంచి వచ్చే వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని క్యాంప్‌

‘హైదరాబాద్‌ నుంచి వచ్చే వారితో అప్రమత్తంగా ఉండాలి’

నర్సంపేట/వరంగల్(ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ నుంచి వచ్చే వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని క్యాంప్‌ కార్యాలయంలో గురువారం  ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ అమలు చేస్తారన్న ప్రచారంతో స్వగ్రామాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పోలీసులు హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్‌, రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు వారంతా హోం క్వారంటైన్‌లో ఉండేలా చూడాలన్నారు. 

Updated Date - 2020-07-03T16:02:59+05:30 IST