జగన్‌రెడ్డి కుట్రలను బీసీలు ఐక్యమై చేధించాలి: టీడీపీ

ABN , First Publish Date - 2022-01-06T23:22:13+05:30 IST

సీఎం జగన్‌రెడ్డి కుట్రలను బీసీలు ఐక్యమై చేధించాలని టీడీపీ బీసీ నేతలు పిలుపునిచ్చారు. టీడీపీ బీసీ నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

జగన్‌రెడ్డి కుట్రలను బీసీలు ఐక్యమై చేధించాలి: టీడీపీ

అమరావతి: సీఎం జగన్‌రెడ్డి కుట్రలను బీసీలు ఐక్యమై చేధించాలని టీడీపీ బీసీ నేతలు పిలుపునిచ్చారు. టీడీపీ బీసీ నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో బీసీలను ఏకం చేసేలా ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు తీర్మానం చేశారు. బీసీల ఐక్యత, సంక్షేమం, అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. బీసీల్లో నాయకత్వ గుర్తింపు కోసం త్వరలోనే క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీసీలకు జగన్‌రెడ్డి మోసపూరిత హామీలు ఇస్తున్నారని, జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీల మధ్య చిచ్చు పెట్టారని నేతలు దుయ్యబట్టారు. స్థానిక సంస్థల్లో బీసీలకు టీడీపీ 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, జగన్‌రెడ్డి స్వలాభం కోసం 24 శాతానికి కుదించి.. 16,800 పదవులు దూరం చేశారని టీడీపీ బీసీ నేతలు విమర్శించారు. బీసీ జనగణనపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్‌రెడ్డి బీసీలకు చేస్తున్న ద్రోహంపై ఉద్యమించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2022-01-06T23:22:13+05:30 IST