బీసీసీఐ తాత్కాలిక సీఈవోగా హేమాంగ్ అమిన్

ABN , First Publish Date - 2020-07-14T21:29:17+05:30 IST

ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమాంగ్ అమిన్‌ను తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా నియమిస్తూ

బీసీసీఐ తాత్కాలిక సీఈవోగా హేమాంగ్ అమిన్

ముంబై: ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమాంగ్ అమిన్‌ను తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ పదవిలో కొనసాగిన రాహుల్ జోహ్రీ రాజీనామాను బోర్డు గత వారం ఆమోదించిన నేపథ్యంలో ఆయన స్థానంలో అమిన్‌ను తాత్కాలిక సీఈవోగా నియమించింది. జోహ్రీ కొన్ని నెలల క్రితమే రాజీనామా చేశారని, క్రికెట్ పాలక మండలి దానిని ఆమోదించిందని బోర్డు పేర్కొంది. బోర్డు అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఉన్నప్పుడు 2016లో జోహ్రీ బీసీసీఐ సీఈవోగా నియమితులయ్యారు.  

Updated Date - 2020-07-14T21:29:17+05:30 IST