బీసీలు ఈశ్వరయ్య లాంటి వ్యక్తుల ట్రాప్లో పడొద్దు: మాజీ జడ్జి రామకృష్ణ
ABN , First Publish Date - 2020-08-09T22:32:40+05:30 IST
బీసీలు రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వ్యక్తుల ట్రాప్లో పడొద్దని మాజీ జడ్జి రామకృష్ణ సూచించారు. చనిపోయిన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని పరితపిస్తున్నానని
అమరావతి: బీసీలు రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వ్యక్తుల ట్రాప్లో పడొద్దని మాజీ జడ్జి రామకృష్ణ సూచించారు. చనిపోయిన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని పరితపిస్తున్నానని ఆయన చెప్పారు. న్యాయవ్యవస్థపై దాడి చేసేందుకు బీసీ కార్డును అడ్డుపెట్టుకుంటున్నారని, ఈశ్వరయ్య బీసీ కులాన్ని అడ్డుపెట్టుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని కాపాడటానికి ఈశ్వరయ్య ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. న్యాయమూర్తులను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారని, హైకోర్టును బద్నాం చేయడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తప్పుబట్టారు. ఈశ్వరయ్య న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబడాల్సి వస్తుందని, ఆడియోలో ఎలాంటి టాంపరింగ్ లేదని మాజీ జడ్జి రామకృష్ణ తెలిపారు.