సాఫీగా సాగిపోతున్న NRI మహిళ జీవితంలో ఒక్కసారిగా అలజడి.. 28ఏళ్ల స్నేహితుడు చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-04-06T21:44:11+05:30 IST

ఉన్నత చదవులు చదివి విదేశాల్లో స్థిరపడాలని చిన్ననాటి నుంచే ఆమె కలలు కంది. అనుకున్నట్టే విదేశాల్లో స్థిరపడింది. సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఒక్కసారిగా అలజడి చోటు చేసుకుంది. ఈ క్రమం

సాఫీగా సాగిపోతున్న NRI మహిళ జీవితంలో ఒక్కసారిగా అలజడి.. 28ఏళ్ల స్నేహితుడు చెప్పింది విని..

ఎన్నారై డెస్క్: ఉన్నత చదవులు చదివి విదేశాల్లో స్థిరపడాలని చిన్ననాటి నుంచే ఆమె కలలు కంది. అనుకున్నట్టే విదేశాల్లో స్థిరపడింది. సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఒక్కసారిగా అలజడి చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆన్‌లైన్ ద్వారా తన సమస్యను పోలీసులకు వివరించింది. దీంతో వెంటనే స్పందించిన అధికారులు రంగంలోకి దిగారు. బ్లాక్‌మెయిల్ చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఇంతకూ విషయం ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



ఇండియాకు చెందిన ఓ మహిళ కెనడాలో స్థిరపడింది. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసిన ఆమె.. ప్రతి విషయాన్ని తన ఫాలోవర్లతో షేర్ చేసుకోవడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని బర్నాలా ప్రాంతానికి చెందిన 28ఏళ్ల గంగదీప్ సింగ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. తాజాగా ఇండియాకు వచ్చిన ఆమె.. గంగదీప్‌‌ను కలిసింది. ఈ సందర్భంగా గంగదీప్ దారుణానికి పాల్పడ్డాడు. 


సీక్రెట్‌గా అభ్యంతరకర రీతిలో ఉన్న ఆమె ఫొటోలను చిత్రీకరించాడు. సదరు మహిళ తిరిగి కెనడాకు వెళ్లిన తర్వాత ఫొటోల ద్వారా ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. రూ.5లక్షలు ఇవ్వకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో భయాందోళనలకు గురైన ఆమె.. అడిగిన మొత్తాన్ని గంగదీప్‌కు అందజేసింది. అయితే గంగదీప్ అంతటితో ఆగలేదు. మళ్లీ పెద్ద మొత్తంలో డబ్బులను డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆన్‌లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. గంగదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. 




Updated Date - 2022-04-06T21:44:11+05:30 IST