బ్యారేజీల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

ABN , First Publish Date - 2022-08-03T05:51:27+05:30 IST

బ్యారేజీల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

బ్యారేజీల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

మహదేవపూర్‌ రూరల్‌, ఆగస్టు 2 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. గోదావరి ప్రవాహం క్రమేణ తగ్గుముఖం పట్టింది. అన్నారం(సరస్వతి) బ్యారేజీలోకి సోమవారం ఇన్‌ఫ్లో 1,02,536 క్యూసెక్కులు ఉండగా  మంగళవారం బ్యారేజీలోకి ఇన్‌ఫ్లో 57,299క ్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 66 గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నీటిమట్టం 107.50 మీటర్లు ఉంది. అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లోతో పాటు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత నది నుంచి 2,66,891క ్యూసెక్కుల ఇన్‌ఫ్లో కలుస్తుండటంతో గోదావరి నది 8.13 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరానికి దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత నది ఇన్‌ఫ్లోతో పాటు అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో కలిపి మొత్తం 3,24,190 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ 85గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తుండగా బ్యారేజీ నీటిమట్టం 92.40 మీటర్లు ఉంది. సోమవారం మేడిగడ్డ బ్యారేజీకి వచ్చే ఇన్‌ఫ్లో 4,02,520 క్యూసెక్కులుగా ఉండగా మంగళవారం 78,330 క్యూసెక్కులు తగ్గింది.

Updated Date - 2022-08-03T05:51:27+05:30 IST