అమ్మో డేటా షేరింగా

ABN , First Publish Date - 2021-03-08T06:33:28+05:30 IST

టెక్నాలజీ ఎంత పెరిగినా వ్యక్తిగత లావాదేవీల వివరాలు (డేటా) బ్యాంకులతో పంచుకునేందుకు ఖాతాదారులు ఏ మాత్రం ఇష్టపడం లేదు. ఒక వేళ చెప్పినా ఆ డేటాకు రక్షణ ఉంటుందా అని భయపడుతున్నారు...

అమ్మో డేటా షేరింగా

  • బ్యాంకు ఖాతాదారుల భయాలు


న్యూఢిల్లీ: టెక్నాలజీ ఎంత పెరిగినా వ్యక్తిగత లావాదేవీల వివరాలు (డేటా) బ్యాంకులతో పంచుకునేందుకు ఖాతాదారులు ఏ మాత్రం ఇష్టపడం లేదు. ఒక వేళ చెప్పినా ఆ డేటాకు రక్షణ ఉంటుందా అని భయపడుతున్నారు. ఏ సైబర్‌ కేటుగాడు ఎక్కడ ఈ వివరాలు కాజేస్తాడోనన్నది వారి ఆందోళన. బ్యాంకులు, ఆర్థిక సంస్థ(ఎ్‌ఫఐ)లదీ ఇదీ పరిస్థితి.  దాదాపు 400 మందిని ప్రశ్నించి డెలారుట్‌ ఇండి యా సంస్థ దీనిపై ఒక నివేదిక రూపొందించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది బ్యాంకులు, ఆర్థిక సంస్థలు డేటా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 80 శాతం మంది ఖాతాదారులైతే పూర్తి రక్షణ ఉంటుందని హామీ  ఇస్తే తప్ప, తమ లావాదేవీల డేటాను షేర్‌ చేసుకునేందుకు ఇష్టపడడం లేదు. మారుతున్న ఖాతాదారుల వైఖరితో బ్యాంకులు, ఆర్థిక సంస్థల వైఖరీ మారుతోంది. ఖాతాదారుల వివరాలు తమ సొంత ఆస్తిగా భావించిన బ్యాంకులు ఇప్పుడు కేవలం సంరక్షులుగా వ్యవహరిస్తున్నాయని డెలాయిట్‌ పేర్కొంది. ఖాతాదారులు అనుమతిస్తే తప్ప, వారి డేలా ఇంకొకరితో పంచుకోవడం లేదు. 

Updated Date - 2021-03-08T06:33:28+05:30 IST