బంగ్లాదే వన్డే సిరీస్
ABN , First Publish Date - 2021-01-23T09:28:45+05:30 IST
స్వదేశంలో వెస్టిండీ్సతో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్సను ఆతిథ్య బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకొంది
ఢాకా: స్వదేశంలో వెస్టిండీ్సతో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్సను ఆతిథ్య బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకొంది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లా 7 వికెట్లతో విజయం సాధించింది. తొలుత మెహ్దీ హసన్ మిరాజ్ (4/25), ముస్తాఫిజుర్ రహ్మాన్ (2/15), షకీబల్ హసన్ (2/30) దెబ్బకు.. విండీస్ 43.4 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. రోమన్ పావెల్ (41) టాప్ స్కోరర్. అనంతరం ఛేదనలో కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (50) అర్ధ సెంచరీతో రాణించడంతో బంగ్లా 33.2 ఓవర్లలో 149/3 స్కోరు చేసి నెగ్గింది. ఆల్రౌండర్ షకీబల్ 43 (నాటౌట్) రన్స్ చేశాడు.