మళ్లీ మైదానంలోకి షకిబ్ అల్ హసన్
ABN , First Publish Date - 2020-08-09T01:26:56+05:30 IST
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకిబ్ అల్హసన్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఫిక్సింగ్ చేయాలంటూ...
ఢాకా: బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకిబ్ అల్హసన్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఫిక్సింగ్ చేయాలంటూ బుకీలు తనను కలిసినప్పటికీ షకిబ్ ఈ విషయాన్ని జాతీయ బోర్డుకు తెలియజేయలేదు. బగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బీసీబీ షకిబ్పై ఒక సంవత్సరం నిషేధం విధించింది. ఈ నిషేధం అక్టోబరు 29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అతడు వచ్చే నెల నుంచి ప్రాక్టీస్ ప్రారంభించనున్నాడు.