12సార్లు చర్చలకు వెళ్లినా ఫలితం లేదు: బండి శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2022-01-29T19:43:41+05:30 IST

ప్రభుత్వం హామీలన్నింటిపై మాట తప్పిందని.. 12 సార్లు చర్చలకు వెళ్లినా ఫలితం లేదని ఉద్యోగుల జేఏసీ నేత బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

12సార్లు చర్చలకు వెళ్లినా ఫలితం లేదు: బండి శ్రీనివాసరావు

విజయవాడ: ప్రభుత్వం హామీలన్నింటిపై మాట తప్పిందని.. 12 సార్లు చర్చలకు వెళ్లినా ఫలితం లేదని ఉద్యోగుల జేఏసీ నేత బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పీఆర్సీ ఉద్యమానికి అన్ని సంఘాలు మద్దతిస్తున్నాయన్నారు. ఫిట్‌మెంట్‌ ఇంత తగ్గిస్తారనుకోలేదన్నారు. హెచ్‌ఆర్‌ఏలోనూ అన్యాయం జరిగిందని బండి శ్రీనివాసరావు వాపోయారు. ఏ లెక్కల ప్రకారం పీఆర్సీ ఇచ్చారో చెప్పాలన్నారు. పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని కోరుతున్నామని బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-29T19:43:41+05:30 IST