అధికారంలోకి రాగానే మొదటి సంతకం వాటిపైనే: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-10-03T00:00:11+05:30 IST

బీజేపీ ప్రభుత్వం వస్తది.. ఉత్తమ విద్య, వైద్యం ఉచితంగా అందించే ఫైల్ పైనే మొదటి సంతకం పెడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

అధికారంలోకి రాగానే మొదటి సంతకం వాటిపైనే: బండి సంజయ్

హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వం వస్తది.. ఉత్తమ విద్య, వైద్యం ఉచితంగా అందించే ఫైల్ పైనే మొదటి సంతకం పెడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధరణి కేసీఆర్ భరినిగా మారిందని విమర్శించారు. ప్రాజెక్టుల కోసం భూములిస్తే.. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజి ఇవ్వకుండా వాళ్ల బతుకులు ఆగం చేశారని మండిపడ్డారు. యాత్రలో అడుగడుగునా ప్రజలు తమ కష్టాలు, బాధలు చెప్పుకుంటున్నరని చెప్పారు.  ప్రాజెక్టు‌లు కట్టినం అని చెప్పుకుంటున్నారు... ఒక్క చుక్క రావడం లేదని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టులంటూ లక్షల కోట్లు కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు. సర్పంచులకు నిధులు లేవని, ఉద్యోగులకు జీతాలు లేవన్నారు. నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎం కోరుకుంటున్నారో తెలులుకోడానికే ఈ యాత్ర అని చెప్పారు. 2023లో గడిల పాలన బద్దలు కొట్టి.. ప్రజా పాలన తీసుకోస్తామన్నారు.  80 శాతం ఉన్న హిందువుల గురించి మాట్లాడితే మతత్వమా ?, తాలిబన్ల రాజ్యం తెస్తామన్న ఎంఐఎం పాలన కావాలా ?, రామ రాజ్యం తెస్తామన్న బీజేపీ కావాలా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలన్నారు.  బైంసాలో మరోసారి కలహాలు సృష్టిస్తే అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఒక వర్గానికి, పార్టీకి కొమ్ము కాసే చర్యలు బీజేపీ సహించదన్నారు.  

Updated Date - 2021-10-03T00:00:11+05:30 IST