కేసీఆర్పై బండి సంజయ్ ఫైర్
ABN , First Publish Date - 2022-02-04T23:25:02+05:30 IST
సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ఢిల్లీ: సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సభ్య సమాజం తలదించుకుంటోందన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పార్లమెంట్ వరకు ‘‘బీజేపీ భీం పాదయాత్ర’’ను సంజయ్ ఆధ్వర్యంలోని బీజేపీ ఎంపీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిగ్గూ లేకుండా కేసీఆర్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు సమర్ధించుకుంటున్నారన్నారు. అధికార గర్వంతో కళ్లు నెత్తికెక్కి కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. అసలు మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని.. సీఎం కేసీఆర్ని అని ఆయన అన్నారు. ఓడిపోయిన కూతురికి ఎమ్మెల్సీ, మందులు ఇచ్చే వారికి రాజ్యసభ సీటు ఇవ్వడానికేనా రాజ్యాంగాన్ని మార్చాల్సింది అని ఆయన నిలదీశారు.