హుజురాబాద్‌లో రైతులే బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లు: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-10-31T01:25:09+05:30 IST

హుజురాబాద్‌లో రైతులే బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. డబ్బుల ద్వారా గెలవాలని చూసిన కేసీఆర్‌కు రైతులు షాక్ ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు.

హుజురాబాద్‌లో రైతులే బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లు: బండి సంజయ్

హైదరాబాద్: హుజురాబాద్‌లో రైతులే బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. డబ్బుల ద్వారా గెలవాలని చూసిన కేసీఆర్‌కు రైతులు షాక్ ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ డబ్బుల పంపిణీని చూసి దేశమే నివ్వెరపోయిందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన టీఆర్ఎస్‌కు హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు.


కాగా హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. ఉదయం 7 గంటల పోలింగ్‌ మొదలవగా.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. పోలింగ్‌ గడువు ముగిసే వరకు పలువురు ఓటర్లు కేంద్రాల్లో బారులు తీరారు. క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉన్నది. సాయంత్రం 5 గంటల వరకే 76.26శాతం పోలింగ్‌ నమోదైంది. 

Updated Date - 2021-10-31T01:25:09+05:30 IST