Bandi Sanjay challenge: సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్
ABN , First Publish Date - 2022-08-19T20:32:25+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సవాల్ విసిరారు.
జనగామ: కేసీఆర్ (CM KCR)కు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ (TRS)లో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలంటూ బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) సవాల్ విసిరారు. మునుగోడు ఉప ఎన్నిక వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్నామన్నారు. మునుగోడు (Munugodu by poll) ఉప ఎన్నిక అంటే సీఎం కేసీఆర్ (KCR) భయపడుతున్నారని తెలిపారు. మునుగోడు ఉప ఉన్నిక బీజేపీ తెచ్చింది కాదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉప ఎన్నికలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈనెల 21 జరిగే బీజేపీ సభలో అమిత్ షా (Union minister Amith shah) సమక్షంలో రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) బీజేపీలో చేరతారన్నారు. టీఆర్ఎస్ సభకు మించి బీజేపీ సభ నిర్వహిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.