నేడు మానుకోటకు బండి సంజయ్‌

ABN , First Publish Date - 2021-03-04T05:22:22+05:30 IST

నేడు మానుకోటకు బండి సంజయ్‌

నేడు మానుకోటకు బండి సంజయ్‌

మహబూబాబాద్‌ రూరల్‌, మార్చి 3 : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్గి గెలుపును కాంక్షిస్తూ  గురువారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మానుకోటకు విచ్చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రాంచందర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొర్రూరు, నెల్లికుదురు క్రాస్‌ రోడ్డు, కేసముద్రం మీదుగా మధ్యాహ్నం 4 గంటలకు మహబూబాబాద్‌కు చేరుకుంటారని చెప్పారు. అనంతరం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి ర్యాలీగా నందన గార్డెన్‌కు చేరుకుని జిల్లాస్థాయి సన్నాహాక సమావేశంలో ప్రసంగిస్తారని చెప్పారు. బీజేపీ నాయకులు పట్టభద్రులు, మేధావులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.   

 

Updated Date - 2021-03-04T05:22:22+05:30 IST