ప్రభుత్వ తప్పిదాలతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు: బల్మూరి వెంకట్

ABN , First Publish Date - 2021-12-17T22:33:30+05:30 IST

ప్రభుత్వ తప్పిదాలతో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్. ఎస్.యూ.ఐ అధ్యక్షుడు బలనూరి వెంకట్ అన్నారు.

ప్రభుత్వ తప్పిదాలతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు: బల్మూరి వెంకట్

హైదరాబాద్: ప్రభుత్వ తప్పిదాలతో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్. ఎస్.యూ.ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు.‘‘కరోనో సమయంలో ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు వద్దని మేం ముందు గానే మంత్రికి, బోర్డ్ సెక్రెటరీకి వినతి పత్రం సమర్పించాం. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ నాశనం అయ్యింది. ప్రమోట్ చేసిన విద్యార్థులందరికీ కనీస మార్కులు వేసి అందరిని పాస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రీ వాల్యువేషన్ కల్పించాలని, రేపు ఉదయం వరకు ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోతే మంత్రిని, సెక్రటరీని అడ్డుకుంటాం. విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకు అండగా మేమున్నాం.. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాము’’ అని వెంకట్ చెప్పారు. 

Updated Date - 2021-12-17T22:33:30+05:30 IST