బాగన్న నిజాయితీపరుడు: మంత్రి హరీశ్ రావు
ABN , First Publish Date - 2021-02-27T22:28:39+05:30 IST
మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న చాలా నిజాయితీపరుడని ఆర్థిక మంత్రి
జహీరాబాద్: మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న చాలా నిజాయితీపరుడని ఆర్థిక మంత్రి హరీశ్ రావు కొనియాడారు. బాగన్న భౌతిక కాయాన్ని సందర్శించి హరీశ్ రావు ఘన నివాళులర్పించారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున 1994-99లో శాసనసభకు చెంగల్ బాగన్న ప్రాతినిధ్యం వహించారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే అయినప్పటికీ సామాన్య వ్యక్తిగానే నిరాడంబర జీవితాన్ని గడిపారని బాగన్నను ఆయన కొనియాడారు.
జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేగా చేసిన ఆయన సేవలు మరువలేనివన్నారు. తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేసిన వ్యక్తని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా నిజాయితీగా పనిచేసిన వ్యక్తని ఆయన అన్నారు. బాగన్న కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని మంత్రి హరీశ్రావు తెలిపారు.