చెప్పుతో ఎక్కడ కొట్టాలో పోసాని చెప్పాలి: అయ్యన్న

ABN , First Publish Date - 2021-12-17T03:06:41+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా సినీ నటుడు పోసాని కృష్ణమురళి పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని..

చెప్పుతో ఎక్కడ కొట్టాలో పోసాని చెప్పాలి: అయ్యన్న

నర్సీపట్నం: ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా సినీ నటుడు పోసాని కృష్ణమురళి పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. జగన్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని, ముఖ్యమంత్రిగా ఆయన పాలన బాగోలేకపోతే తనను చెప్పుతో కొట్టండని 2019 ఎన్నికలకు ముందు ఆయన ఘంటాపథంగా చెప్పారు. అప్పుడు పోసాని చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడు టీడీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.


పోసాని కృష్ణమురళిపై తాజాగా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు చేశారు. గత మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో పోసాని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ఏ ప్రభుత్వం చేయలేనంత అభివృద్ధిచేసి చూపిస్తారని, లేనిపక్షంలో ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టండని పోసాని కృష్ణమురళి అన్నారని అయ్యన్న గుర్తు చేశారు. ఎక్కడ కొట్టాలో పోసాని చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-17T03:06:41+05:30 IST