నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ... విజయసాయి రెడ్డి...: అయ్యన్న

ABN , First Publish Date - 2022-04-17T16:51:10+05:30 IST

నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ... విజయసాయి రెడ్డి...: అయ్యన్న

నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ... విజయసాయి రెడ్డి...: అయ్యన్న

అమరావతి: ఏ1 జగన్ రెడ్డి గారు వాలంటీర్ల ఉద్యోగాలు ఇస్తే నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ... ఏ2 విజయసాయి రెడ్డి సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు ఇప్పించాడట అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. జాబ్ మేళా అంటే ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, టెలికాం లాంటి రంగాల్లో  ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నానని, మీరు ఇచ్చేది సెక్యూరిటీ గార్డ్, హెల్పర్, సేల్స్ పోస్ట్‌లని ఇప్పుడు తెలిసిందన్నారు. (బ్లూ) మీడియా హడావుడి చూసి జగన్ రెడ్డి హామీ ఇచ్చిన 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎలాగో చెయ్యడం లేదుగా, కనీసం వీసా రెడ్డి సీమ ప్రాంత బిడ్డలకు నాలుగు ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తాడు అని ఆశపడ్డామన్నారు. ఫైనల్‌గా తేలింది ఏంటంటే....రెజ్యుమ్‌లు ఇచ్చి వెళ్ళమన్నారట అని ఎద్దేవా చేశారు. మీ ప్రచార యావ వల్ల రాను పోను ఛార్జీలు వృధా అయ్యాయని మండిపడ్డారు. మీ బ్రతుక్కి రూ.5 వేల జీతానికి మించి ఆశించి రావడం ముమ్మాటికీ తప్పేనన్నారు. 

Updated Date - 2022-04-17T16:51:10+05:30 IST