అవ్వాతాతలను జగన్రెడ్డి నిండా ముంచారు: అయ్యన్న
ABN , First Publish Date - 2022-01-01T20:37:04+05:30 IST
నమ్మి ఓటేసిన అవ్వాతాతలను జగన్రెడ్డి నిండా ముంచారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. పెన్షన్ను రూ.3 వేలకి పెంచుతామని హామీఇచ్చి అధికారంలోకి వచ్చాక పెంచింది రూ.250 మాత్రమేనన్నారు.
అమరావతి: నమ్మి ఓటేసిన అవ్వాతాతలను జగన్రెడ్డి నిండా ముంచారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. పెన్షన్ను రూ.3 వేలకి పెంచుతామని హామీఇచ్చి అధికారంలోకి వచ్చాక పెంచింది రూ.250 మాత్రమేనన్నారు. ప్రజాధనం, పేదల్ని దోచుకుంటున్న దోపిడీ దొంగ జగన్రెడ్డి అని అన్నారు. ఈ ఏడాదిలోనైనా సీఎం జగన్రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.