అడవుల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహనా కార్యక్రమాలు

ABN , First Publish Date - 2021-03-05T23:13:27+05:30 IST

రాష్ట్రంలోని అడవుల్లో అగ్ని ప్రమాదాల పై సమీపంలోని గ్రామాల ప్రజలకు అటవీశాఖ అధికారులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

అడవుల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహనా కార్యక్రమాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అడవుల్లో అగ్ని ప్రమాదాల పై  సమీపంలోని గ్రామాల ప్రజలకు అటవీశాఖ అధికారులు  అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అడవుల్లోకి వెళ్లేకొందరు చిన్న నిప్పును అక్కడ వేసినా అగ్ని ప్రమాదాలుజరుగుతాయని, అలాగే ప్రజలు ఆయా జంతులను వేటాడ కూడదని కూడా అధికారులు వారికి వెల్లడించారు. ఈమేరకు ఫారెస్ట్‌ అధికారులు మెదక్‌జిల్లా రేంజ్‌ పరిధిలోని పోచారం గ్రామంలో స్థానికులకు వాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 


ఈ సందర్భంగా అధికారులు పాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను, పశువుల కాపరులను, గ్రామ ప్రజలను పిలిచి వారికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా అడవుల్లోఅగ్ని ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నవిషయం పై వారికి వివరించారు. అలాగే జంతువులను వేటాడ వద్దని కూడా వారికి వివరించారు. అధికారులు రామయం పేట రేంజ్‌పరిధిలోని ఖాజాపూర్‌లోనూ అవగాహనా క్యాంపు నిర్వహించారు. 

Updated Date - 2021-03-05T23:13:27+05:30 IST