సాహితీ పురస్కారాల ప్రదానం
ABN , First Publish Date - 2021-01-25T06:08:10+05:30 IST
డా. పట్టాభి కళాపీఠము, విజయవాడ; మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సాహితీ పురస్కారాల సభ ...
డా. పట్టాభి కళాపీఠము, విజయవాడ; మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సాహితీ పురస్కారాల సభ జనవరి 26 సా.6గం.లకు జూమ్ వేదికగా జరుగుతుంది. శ్రీ మక్కెన రామసుబ్బయ్య స్మారక కథా పురస్కారం 2020ను ‘ముగ్గురాళ్ల మిట్ట’ కథా సంపుటికి ఆర్.సి.కృష్ణస్వామిరాజు, ఆచార్య నెల్లుట్ల స్మారక కవితా పురస్కారం 2020ను ‘దుర్గాపురం రోడ్’ కథా సంపుటికి దేశరాజు, డా. కె.వి.రావు స్మారక శాస్త్ర విజ్ఞాన పుస్తక పురస్కారం 2020ను ‘హస్తలేఖనం ఓ కళ’ పుస్తకానికి ఆత్మకూరు రామకృష్ణ అందుకుంటారు.
మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్