కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
ABN , First Publish Date - 2022-03-16T22:59:31+05:30 IST
జిల్లాలోని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కాన్పు
సూర్యాపేట: జిల్లాలోని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీని సిబ్బంది వెనక్కి పంపారు. హెచ్ఐవీ భాదితురాలు కాన్పు కోసం వచ్చింది. అయితే హెచ్ఐవీ కిట్లు లేవని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సిబ్బంది సూచించారు. అంబులెన్స్లో వెళ్తుండగా మార్గమధ్యలోనే డెలివరీ అయింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు వీరిని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.