వైసీపీ లాగా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదు: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-05-27T17:00:36+05:30 IST

చంద్రబాబు(chandrababu) సీఎం కాగానే కార్యకర్తలదే అధికారమని ఏపీ టీడీపీ(TDP) అధ్యక్షుడు మహానాడు అచ్చెన్నాయుడు(Achennaidu) పేర్కొన్నారు

వైసీపీ లాగా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదు: అచ్చెన్నాయుడు

ఒంగోలు : చంద్రబాబు(chandrababu) సీఎం కాగానే కార్యకర్తలదే అధికారమని ఏపీ టీడీపీ(TDP) అధ్యక్షుడు మహానాడు అచ్చెన్నాయుడు(Achennaidu) పేర్కొన్నారు. ఇబ్బంది పెట్టిన వారిని కార్యకర్తలతోనే శిక్షలు విధించేలా న్యాయబద్దమైన.. చట్టబద్దమైన అధికారాలు కల్పిస్తామన్నారు. చంద్రబాబు సీఎం కాగానే కార్యకర్తలపై తప్పుడు కేసులను ఒక్క సంతకంతో ఎత్తేస్తామన్నారు. వైసీపీ(YCP) చేపడుతోన్న బస్ యాత్రలో వస్తున్నది మంత్రులు కాదని.. అలీబాబా దొంగలు వస్తున్నారన్నారు. ఇంకా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబును సీఎం చేయడానికి కార్యకర్తలు శపథం చేశారు. అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల కోసమే టీడీపీ రాజకీయం చేస్తున్నారు. గత మూడేళ్లుగా చంద్రబాబు మొదలుకుని.. సాధారణ కార్యకర్త వరకూ చాలా ఇబ్బందులు పడ్డారు. వైసీపీ లాగా టీడీపీ గాలికి పుట్టిన పార్టీ కాదు. టీడీపీ ప్రజల మనస్సుల్లో నుంచి పుట్టిన పార్టీ. టీడీపీని లేకుండా చేయడం జగన్.. తాత, తండ్రి వల్ల కూడా కాలేదు. రోడ్డెక్కడానికి భయపడే పరిస్థితి నుంచి రోడ్డెక్కి పోరాటం చేసే స్థితికి కార్యకర్తలు చేరారు. చంద్రబాబు ప్రజల్లోకి రాగానే రాష్ట్రం షేక్ అయింది. ఉత్తరాంధ్రలోనే కాదు.. చంద్రబాబు కడప వెళ్తే ఆ జిల్లా దద్దరిల్లింది’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-05-27T17:00:36+05:30 IST