మూడేళ్లైనా పెంచింది కేవలం రూ. 250 మాత్రమే: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-01-01T22:38:21+05:30 IST

మూడేళ్లైనా పెంచింది కేవలం రూ. 250 మాత్రమే: అచ్చెన్నాయుడు

మూడేళ్లైనా పెంచింది కేవలం రూ. 250 మాత్రమే: అచ్చెన్నాయుడు

అమరావతి: వృద్ధుల పెన్షన్ రూ.2 వేల నుండి రూ.3 వేలకు పెంచుతామని తిరుపతి సభలో జగన్‌రెడ్డి చెప్పారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా పెంచింది కేవలం రూ. 250 మాత్రమేనన్నారు. జగన్ రెడ్డి, వైఎస్ కలిపి పెంచింది కేవలం రూ.375 మాత్రమేనన్నారు. వయోపరిమితి తగ్గించడంతో లక్షలాది మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చామంటున్నారని చెప్పారు. కొత్తగా ఎంత మందికి పెన్షన్లు మంజూరు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ఏంటి.? అమలు చేస్తున్నదేమిటి.? అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్‌రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2022-01-01T22:38:21+05:30 IST