అధికారులపై ఎదురు కేసులు సరికాదు
ABN , First Publish Date - 2020-07-14T07:51:57+05:30 IST
విచారణ చేస్తున్నారన్న కారణంతో తిరిగి అధికారులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం
- ఎక్సైజ్ అధికారుల సంఘం ఆక్షేపణ
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): విచారణ చేస్తున్నారన్న కారణంతో తిరిగి అధికారులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం సరికాదని ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం ఆక్షేపించింది. ప్రకాశం జిల్లాలో మద్యం అక్రమ తరలింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కానిస్టేబుల్ అధికారులపైనే కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు బి.నర్సింహులు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.