రవి దహియా పసిడి పట్టు

ABN , First Publish Date - 2020-02-23T10:21:56+05:30 IST

ఆసియన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో రవి కుమార్‌ దహియా స్వర్ణం కైవసం చేసుకోగా.. డిఫెండింగ్‌ చాంప్‌ బజ్‌రంగ్‌ పూనియా, సత్యవర్త్‌ కడియన్‌, గౌరవ్‌ బలియా ...

రవి దహియా పసిడి పట్టు

ఫైనల్లో  బజ్‌రంగ్‌కు షాక్‌

సత్యవర్త్‌, గౌరవ్‌కు కూడా...

ఆసియన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

న్యూఢిల్లీ: ఆసియన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో రవి కుమార్‌ దహియా స్వర్ణం కైవసం చేసుకోగా.. డిఫెండింగ్‌ చాంప్‌ బజ్‌రంగ్‌ పూనియా, సత్యవర్త్‌ కడియన్‌, గౌరవ్‌ బలియా ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. దీంతో పోటీలకు ఐదో రోజైన శనివారం భారత్‌కు స్వర్ణం సహా మూడు రజతాలు దక్కాయి.  ఫ్రీస్టయిల్‌ విభాగం 57 కిలోల పసిడి బౌట్‌లో రవి కుమార్‌ 10-0తో హిక్‌మటుల్లో విహిదోవ్‌ (తజికిస్థాన్‌) పై టెక్నికల్‌ సుపీరియారిటీతో నెగ్గాడు. కాగా, 65 కిలోల ఫైనల్లో బజ్‌రంగ్‌ 1-10తో టకుటో ఒటోగురా (జపాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. 97 కిలోల్లో సత్యవర్త్‌ 0-10తో మహమ్మద్‌ షఫి (ఇరాన్‌) చేతిలో, 79 కిలోల్లో గౌరవ్‌ 5-7తో బుడాడ్జపోవ్‌ చేతిలో ఓడారు. 70 కిలోల విభాగం సెమీస్‌లో నవీన్‌ 2-3తో మిరిజ్హాన్‌ అషిరోవ్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. 

Updated Date - 2020-02-23T10:21:56+05:30 IST