సెమీ్‌సలో భారత జట్లు

ABN , First Publish Date - 2020-10-24T09:25:14+05:30 IST

సియా నేషన్స్‌ ఆన్‌లైన్‌ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో భారత పురుష, మహిళా జట్లు సెమీఫైనల్స్‌లో ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన మహిళల

సెమీ్‌సలో భారత జట్లు

ఆసియా ఆన్‌లైన్‌ టీమ్‌ చెస్‌

న్యూఢిల్లీ: ఆసియా నేషన్స్‌ ఆన్‌లైన్‌ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో భారత పురుష, మహిళా జట్లు సెమీఫైనల్స్‌లో ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్స్‌లో కిర్గిస్థాన్‌తో తలపడిన భారత్‌ 4-0తో తొలి అంచెలో, 3.5-0.5తో రెండో అంచెలో విజయాలు సాధించి సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకోంది. టాప్‌ బోర్డులో కెప్టెన్‌ మేరీ గోమ్స్‌, యువ గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌.వైశాలి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో భారత్‌ సునాయాసంగా గెలుపొందింది. సెమీ్‌సలో భారత అమ్మాయిలు మంగోలియాతో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇక, పురుషుల క్వార్టర్స్‌లో మంగోలియాతో తలపడిన భారత జట్టుకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. రెండు రౌండ్లలోనూ ఒకే స్కోరుతో 2.5-1.5 విజయాలు సాధించిన భారత్‌ సెమీస్‌ స్థానాన్ని కైవసం చేసుకొంది. తొలి రౌండ్‌ ప్రారంభంలో తడబడిన భారత్‌ను అధిబన్‌, శశికిరణ్‌, సేతురామన్‌ వరుస విజయాలు సాధించి పోటీలోకి తీసుకొచ్చారు. రెండో రౌండ్లో అధిబన్‌, నిహాల్‌ విజయా లతో గట్టెక్కిన భారత్‌ సెమీస్‌ చేరింది. సెమీస్‌లో ఇరాన్‌తో భారత్‌ తలపడనుంది.

Updated Date - 2020-10-24T09:25:14+05:30 IST