సీజేఐ రమణతో అశోక్గౌడ్ భేటీ
ABN , First Publish Date - 2021-07-19T08:48:38+05:30 IST
తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్ ఆదివారం
న్యూఢిల్లీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్ ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో ఖాళీగా ఉన్న జడ్జి పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్ హైకోర్టును సందర్శించేందుకు రావాలని బార్ అసోసియేషన్ తరఫున జస్టిస్ రమణను ఆహ్వానించారు.