అరెస్టైన వారంతా తెలంగాణ వాళ్లే: రైల్వే ఎస్పీ అనురాధ

ABN , First Publish Date - 2022-06-20T02:37:46+05:30 IST

సికింద్రాబాద్ అల్లర్లపై రైల్వే ఎస్పీ అనూరాధ స్పందించారు. ఆదివారం అనురాధ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు సంయమనం పాటించారని తెలిపారు.

అరెస్టైన వారంతా తెలంగాణ వాళ్లే: రైల్వే ఎస్పీ అనురాధ

హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్లపై రైల్వే ఎస్పీ అనూరాధ స్పందించారు. ఆదివారం అనురాధ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు సంయమనం పాటించారని తెలిపారు. ఆందోళన హద్దులు మీరడంతో అప్రమత్తమయ్యారని చెప్పారు. పోలీసులు, ప్రయాణికులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని, రెండు వేల మంది ఆందోళనల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. అభ్యర్థులను రెచ్చగొట్టిన కోచింగ్ సెంటర్లను గుర్తించామని ప్రకటించారు. వాట్సాప్ గ్రూపుల్లో చర్చించి దాడికి పాల్పడ్డారని, ఆధారాలతో సహా 46 మందిని అరెస్టు చేశామని వివరించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లలో.. అరెస్టైన వారంతా తెలంగాణ వాళ్లేనని వెల్లడించారు. రైల్వే యాక్ట్ 150 కింద నిందితులకు యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని అనురాధ హెచ్చరించారు.

Updated Date - 2022-06-20T02:37:46+05:30 IST