మరో ఆరు జిల్లాలకు ‘వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ’

ABN , First Publish Date - 2020-07-14T07:50:18+05:30 IST

వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోనే చేయించుకునే వెసులుబాటును మరో ఆరు జిల్లాలకు వర్తింపచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

మరో ఆరు జిల్లాలకు ‘వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ’

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోనే చేయించుకునే వెసులుబాటును మరో ఆరు జిల్లాలకు వర్తింపచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ మల్లికార్జున్‌ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ పథాన్ని ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాకు మాత్రమే పరిమితం కాగా... కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోనూ అమలు చేయాలని చెప్పారు. 

Updated Date - 2020-07-14T07:50:18+05:30 IST