‘కరోనా వల్ల ఏపీలో ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు’
ABN , First Publish Date - 2020-03-28T19:33:57+05:30 IST
నెల్లూరు: కరోనా వల్ల ఏపీలో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని... దేశంలో 60 శాతం ఆక్వా రాష్ట్రంలోనే సాగవుతుందిని..
నెల్లూరు: కరోనా వల్ల ఏపీలో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని... దేశంలో 60 శాతం ఆక్వా రాష్ట్రంలోనే సాగవుతుందిని ఏపీ ఆక్వా రైతుల సంక్షేమ సంఘం నేత రాధాకృష్ణారెడ్డి తెలిపారు. కేంద్రం ఎన్ఎఫ్డీసీ నిధులను ఆక్వా రైతుల సంక్షేమానికి వెచ్చించాలన్నారు. రొయ్యలు, చేపలు నిల్వ చేసుకునేందుకు... రాష్ట్ర ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయాలని రాధాకృష్ణారెడ్డి కోరారు.