భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం: ఏపీఎన్జీఓ నేత బండి
ABN , First Publish Date - 2021-11-12T22:06:24+05:30 IST
రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఏపీఎన్జీఓ నేత
అమరావతి: రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఏపీఎన్జీఓ నేత బండి శ్రీనివాస్ తెలిపారు. పీఆర్సీ సహా ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలపై అధికారుల ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీఆర్సీ రిపోర్ట్ ఇస్తామని నాలుగుసార్లు తిప్పించుకున్నారని ఆయన ఆరోపించారు. గత నెలాఖరు వరకు పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వ సలహాదారు చెప్పారన్నారు. పీఆర్సీని ఎందుకు బహిర్గతం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం పీఆర్సీ రిపోర్ట్ను ఎందుకు దాస్తోందన్నారు. రిపోర్ట్ ఇచ్చి మూడేళ్లయ్యిందని ఆయన పేర్కొన్నారు. పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వకపోవడం తమను అవమానించడమేనని ఆయన అన్నారు. దీనిపై రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.