రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏపీ హెచ్ఆర్‌సీ చైర్మన్ విచారణ

ABN , First Publish Date - 2022-06-29T18:33:58+05:30 IST

రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏపీ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి విచారణ నిర్వహించారు.

రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏపీ హెచ్ఆర్‌సీ చైర్మన్ విచారణ

రాజమండ్రి : రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏపీ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి విచారణ నిర్వహించారు. ఈ ఏడాది మార్చి నెలలో పోలీసుల వేధింపుల వల్ల ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య చేసుకున్న కేసుపై విచారణ నిర్వహించారు. మానవ హక్కుల కమిషన్ విచారణకు హాజరయ్యి శ్రీకృష్ణ భగవాన్ కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు రాతపూర్వకంగా ఆధారాలు అందజేశారు. ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్యకు కారణమైన సీఐ దుర్గా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2022-06-29T18:33:58+05:30 IST