ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2022-01-19T18:31:39+05:30 IST

ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌కు కరోనా పాజిటివ్

విజయవాడ: ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కోవిడ్ నియమావళిని కచ్చితంగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఏపీసీసీ అధినేత తెలిపారు.  ఎవరూ అందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కూడా కొవిడ్ పరీక్షలు తప్పని సరిగా చేయించుకోవాలని శైలజానాథ్ సూచించారు. 

Updated Date - 2022-01-19T18:31:39+05:30 IST