నాకు జరిగిన అవమానం మరెవరికీ జరగకూడదు

ABN , First Publish Date - 2021-11-27T08:18:41+05:30 IST

రాష్ట్ర శాసన సభలో గతవారం జరిగిన ఘటనపై నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు...

నాకు జరిగిన అవమానం మరెవరికీ జరగకూడదు

తమ ఇంటి మహిళగా భావించి 

ఎందరో అండగా నిలబడ్డారు

జీవితంలో మరిచిపోలేను: నారా భువనేశ్వరి

తమ ఇంటి మహిళగా భావించి ఎందరో అండగా నిలబడ్డారు

జీవితంలో మరిచిపోలేను: నారా భువనేశ్వరి


అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసన సభలో గతవారం జరిగిన ఘటనపై నారా భువనేశ్వరి తొలిసారి స్పందించారు. శుక్రవారం ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ త ల్లికి, కూతురుకి, తోబుట్టువుకి జరిగినట్లు భావించి నాకు అండగా నిలబడడం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాము. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కష్టాల్లో, ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నా’’అని భువనేశ్వరి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-27T08:18:41+05:30 IST