కదిరిలో వైసీపీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి అనుచరుల దౌర్జన్యం

ABN , First Publish Date - 2022-07-05T00:21:38+05:30 IST

జిల్లాలోని కదిరిలో వైసీపీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే అనుచరుడు శివారెడ్డి అక్రమ నిర్మాణం చేపట్టినట్లు అరోపణలు వస్తున్నాయి.

కదిరిలో వైసీపీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి అనుచరుల దౌర్జన్యం

శ్రీసత్యసాయి: జిల్లాలోని కదిరిలో వైసీపీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే అనుచరుడు శివారెడ్డి అక్రమ నిర్మాణం చేపట్టినట్లు అరోపణలు వస్తున్నాయి. అడపాలవీధిలో 84 సెంట్ల ప్రభుత్వ భూమిపై ఎమ్మెల్యే అనుచరుల కన్ను పడిందని ఆరోపణలు ఉన్నాయి. కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే గోడలు నిర్మాణం కూడా పూర్తయింది. అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే సిద్దారెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే సిద్దారెడ్డి అనుచరుల దాడితో అధికారులు వెనుదిరిగారు. 

Updated Date - 2022-07-05T00:21:38+05:30 IST