దారుణం... దంపతుల హత్య
ABN , First Publish Date - 2022-08-08T21:37:10+05:30 IST
దారుణం... దంపతుల హత్య
విశాఖ: పెందుర్తిలో దారుణఘటన చేసుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో దంపతుల మృతి చెందారు. పెందుర్తి మండలం చిన్నముషిడివాడ సమీపంలో ఉన్న సప్తగిరి నగర్లో నిర్మాణం జరుగుతున్న అపార్ట్మెంట్ లో వాచ్ మెన్గా పనిచేస్తున్న అప్పారావు, బలక్ష్మీ దంపతులుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో క్లూస్ టీమ్తో పెందుర్తి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.