మదనపల్లి మహానాడుకు పోలీసుల అడ్డంకులు

ABN , First Publish Date - 2022-07-06T22:09:11+05:30 IST

మదనపల్లి మహానాడుకు పోలీసుల అడ్డంకులు సృష్టిస్తున్నారు. టీడీపీ శ్రేణులను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు.

మదనపల్లి మహానాడుకు పోలీసుల అడ్డంకులు

చిత్తూరు: మదనపల్లి మహానాడుకు పోలీసుల అడ్డంకులు సృష్టిస్తున్నారు. టీడీపీ శ్రేణులను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. రహదారిపై భారీ వాహనాలకు అనుమతి ఇవ్వడంతో అక్కడి చేరుకునే ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. టీడీపీ వాహనాలు వెళ్లకుండా మరీ పోలీసులు లారీలకు అనుమతిస్తున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ శ్రేణుల ఆందోళనకు దిగారు. రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డితో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. 

Updated Date - 2022-07-06T22:09:11+05:30 IST