మాజీ ఎమ్మెల్యే పాటిల్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2022-02-13T08:50:44+05:30 IST

మాజీ ఎమ్మెల్యే పాటిల్‌ కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే పాటిల్‌ కన్నుమూత

రాయదుర్గం, ఫిబ్రవరి 12 : అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే పాటిల్‌ వేణుగోపాల్‌ రెడ్డి (72) శనివారం కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. రాయదుర్గం ఎమ్మెల్యేగా ఆయన రెండు సార్లు కాంగ్రెస్‌ పార్టీ నుంచి, ఒకసారి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో ఆయనతో పాటు ఆయన కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది.

Updated Date - 2022-02-13T08:50:44+05:30 IST