వెండి తెరపై పెళ్లి వేడుక

ABN , First Publish Date - 2022-05-23T08:49:18+05:30 IST

వెండి తెరపై పెళ్లి వేడుక

వెండి తెరపై పెళ్లి వేడుక

అమెరికాలో అమ్మాయి పెళ్లి... ఆంధ్ర నుంచి తల్లిదండ్రుల కన్యాదానం


సూళ్లూరుపేట, మే 22: కన్యాం కనక సంపన్నాం.. కనకాభరణైర్యుతాం.. అంటూ వెండితెర ముందు వధువు తలిదండ్రులు కన్యాదానం చేసి.. ధర్మేచ అర్థేచ కామేచ.. నాతిచరితవ్య.. అంటూ వరుడిని మాటిమ్మని కోరగా.. నాతి చరామీ అంటూ మూడు మార్లు పలికి అమెరికా నుంచి వరుడు హామీ ఇచ్చాడు. ఖండాంతరాల ఆవల కన్న కూతురి కల్యాణం జరుగుతుంటే అక్కడికి చేరుకోలేని ఆ తల్లిదండ్రులు సూళ్లూరుపేటలో వెండితెరపై వివాహ తంతులో పాల్గొని సంతృప్తిపడిన ఉదంతం ఇది. నెల్లూరుకు చెందిన పలగాటి శ్రీనివాసులురెడ్డి, సునీల దంపతుల తనయ రిషిత అమెరికాలో ఎంబీఏ చదువుతోంది. ఆమెకు అమెరికా నివాసులైన పర్వతరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జ్యోతి దంపతుల తనయుడు రోహిత్‌రెడ్డితో అమెరికాలో మే 21వ తేదీ (భారత కాలమానం మేరకు మే 22వ తేదీ)న వివాహం జరిపించాలని నిర్ణయించారు. అమ్మాయి తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లేందుకు వీసాకు దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు. దాంతో కుమార్తె పెళ్లి వేడుక చూడాలని సూళ్లూరుపేటలోని బాహుబలి (వీఎపిక్‌) థియేటర్‌ను బుక్‌ చేసుకున్నారు. బంధుమిత్రులతో కలిసి ఆ థియేటర్‌లో వెండితెరపై అమెరికాలో జరుగుతున్న కుమార్తె వివాహాన్ని వీక్షించారు.  

Updated Date - 2022-05-23T08:49:18+05:30 IST