అందుకే గుంత‌లో త‌ట్టెడు మ‌ట్టి క‌ప్పడానికి ముందుకు రావడం లేదు: లోకేష్

ABN , First Publish Date - 2022-04-07T22:08:25+05:30 IST

అందుకే గుంత‌లో త‌ట్టెడు మ‌ట్టి క‌ప్పడానికి ముందుకు రావడం లేదు: లోకేష్

అందుకే గుంత‌లో త‌ట్టెడు మ‌ట్టి క‌ప్పడానికి ముందుకు రావడం లేదు: లోకేష్

అమరావతి: జ‌గ‌న్‌రెడ్డి చేత‌కాని తనం, అవినీతి, బంధుప్రీతి వ‌ల్ల ఆ పార్టీ నేత‌లు బ‌ల‌వుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఆర్అండ్‌బీ రోడ్ల మ‌ర‌మ్మతుల బిల్లులు కాంట్రాక్టర్లకి చెల్లించ‌క‌పోవ‌డంతో ఎవ‌రూ క‌నీసం గుంత‌లో త‌ట్టెడు మ‌ట్టి క‌ప్పడానికి ముందుకు రావ‌డంలేదన్నారు. అలా ప‌డిన గుంతే వైసీపీకి చెందిన కృష్ణా జిల్లా ఉంగుటూరు ఎంపీపీ ప్రస‌న్నల‌క్ష్మి ప్రాణం తీసిందన్నారు. జ‌గ‌న్‌రెడ్డి అవినీతి దాహం-బంధుప్రీతి మృత్యువులా వ‌చ్చాయన్నారు. అంబులెన్సుల్లో వంద‌ల‌కోట్లు దోచేందుకు విజ‌య‌సాయిరెడ్డి అల్లుడికి క‌ట్నంగా ఇచ్చేశాడన్నారు. ప్రమాదం జ‌రిగింద‌ని అంబులెన్స్‌కి ఫోన్ చేస్తే సాయిరెడ్డి అల్లుడి అంబులెన్స్ రాలేదన్నారు. దీంతో ప్రస్తన్నలక్ష్మీ చనిపోయిందనా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-04-07T22:08:25+05:30 IST