కంకిపాడు పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తం

ABN , First Publish Date - 2022-08-06T21:36:56+05:30 IST

కంకిపాడు పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తం

కంకిపాడు పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తం

కృష్ణా: జిల్లాలోని కంకిపాడు పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు కొట్టడంతో మనస్తాపం చెందిన రాజులపాటి అరవింద్ ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతిడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అరవింద్ మృతి కారణమైన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ వద్ద వారు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకు వెళ్లేందుకు మృతుడు బంధువులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పెడన నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి కాగిత కృష్ణ ప్రసాద్ కంకిపాడు చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి నివాళ్ళు అర్పించారు. అనంతరం మృతుడు తరుపు బంధువులు, పోలీసులతో  కృష్ణ ప్రసాద్ చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానంటూ సీఐ హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-08-06T21:36:56+05:30 IST