అనంతబాబుపై ఉన్న 27 కేసులపై విచారణ చేపట్టాలి: అఖిలపక్షం
ABN , First Publish Date - 2022-05-24T23:40:04+05:30 IST
అనంతబాబుపై ఉన్న 27 కేసులపై విచారణ చేపట్టాలి: అఖిలపక్షం
విజయవాడ: సుబ్రహ్మణ్యం హత్యపై సీబీఐ విచారణకు అఖిలపక్షం డిమాండ్ చేసింది. కాకినాడ కలెక్టర్కు అఖిల పక్షం నేతలు వినతిపత్రం ఇచ్చారు. హత్యకేసుపై పోలీసులు పూర్తి విచారణ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. అనంతబాబుకు పోలీసులు కొమ్ముకాశారని అఖిలపక్షం పేర్కొంది. సుబ్రహ్మణ్యం హత్య విషయంలో ఎస్పీ కట్టుకథ చెప్పారని వ్యాఖ్యానించింది. ఎమ్మెల్సీ అనంతబాబుపై ఉన్న 27 కేసులపై విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. కలెక్టర్ను టీడీపీ నేత గొల్లపల్ఇ సూర్యారావు, సీపీఐ రామకృష్ణ కలిసిన వారిలో ఉన్నారు.