అమ్మవారి ఆలయంలో అపచారం!

ABN , First Publish Date - 2020-12-05T10:56:19+05:30 IST

గుంటూరులోని దక్షిణ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని తొలగించేందుకు మున్సిపల్‌ అధికారులు యత్నించడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.

అమ్మవారి ఆలయంలో అపచారం!

దేవాలయం కూల్చివేతకు మున్సిపల్‌ అధికారుల యత్నం 

చెప్పులు వేసుకొని గుడిలోకి వెళ్లిన అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ 


గుంటూరు, డిసెంబరు 4: గుంటూరులోని దక్షిణ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని తొలగించేందుకు మున్సిపల్‌ అధికారులు యత్నించడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రింగురోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా టీజేపీఎస్‌ కాలేజీ సమీపంలో ఉన్న ఈ ఆలయం వద్దకు మున్సిపల్‌ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ అశోక్‌కుమార్‌, సిబ్బంది గురువారం జేసీబీతో వెళ్లారు. ఆలయంలోకి వెళ్లిన అశోక్‌కుమార్‌ బీరువా తెరిచి అందులోని అమ్మవారి పట్టువస్ర్తాలు బయటపడేశారని, చెప్పులు వేసుకొని గుడి లోపలకు వెళ్లడంతో పాటు అక్కడున్న కాలభైరవ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారని పూజారి యర్రంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. ఏసీపీ తీరును నిరసిస్తూ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు శుక్రవారం కంకరగుంట ఫ్లైఓవర్‌ వద్ద ధర్నాకు దిగగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-12-05T10:56:19+05:30 IST